'నా పాన్‌ కార్డ్‌ దుర్వినియోగం చేశారు'.. విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో కళాశాల విద్యార్థి అయిన ఒక యువకుడు తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

By అంజి  Published on  30 March 2024 5:36 AM GMT
PAN Card Misused, Madhya Pradesh, Student, Tax Notice

'నా పాన్‌ కార్డ్‌ దుర్వినియోగం చేశారు'.. విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో కళాశాల విద్యార్థి అయిన ఒక యువకుడు తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు. గ్వాలియర్‌లో నివసిస్తున్న ప్రమోద్ కుమార్ దండోటియా (సుమారు 25 సంవత్సరాలు) అనే యువకుడికి ఆదాయపు పన్ను, జీఎస్‌టీ నుండి తన పాన్ కార్డ్ ద్వారా ఒక కంపెనీ రిజిస్టర్ చేయబడిందని నోటీసు రావడంతో విషయం తెలుసుకున్నాడు. సదరు కంపెనీ ముంబై, ఢిల్లీ వేదికగా 2021లో కార్యకలాపాలు నిర్వహించింది.

దండోటియా మాట్లాడుతూ.. "నేను గ్వాలియర్‌లో కాలేజీ విద్యార్థిని. ఆదాయపు పన్ను అండ్‌ జీఎస్‌టీ నుండి నోటీసు వచ్చిన తర్వాత అధికారులను సంప్రదించాను. ముంబై, ఢిల్లీ 2021లో నిర్వహించబడుతున్న నా పాన్ కార్డ్ ద్వారా ఒక కంపెనీ రిజిస్టర్ అయిందని నాకు తెలిసింది. అయితే అది ఎలా జరిగిందో నాకు తెలియదు. నా పాన్ కార్డ్ దుర్వినియోగం చేయబడింది. లావాదేవీలు ఎలా జరిగాయి" అని తెలిపాడు.

ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శుక్రవారం మరోసారి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి చేరుకుని మరోసారి ఫిర్యాదు చేశారు.

అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షియాజ్ కేఎం మాట్లాడుతూ.. "ఈ రోజు తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగినట్లు ఒక యువకుడి నుండి దరఖాస్తు వచ్చింది. దీనికి సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నారు. పాన్ కార్డును దుర్వినియోగం చేసి, దాని ద్వారా ఒక కంపెనీని రిజిస్టర్ చేసి, ఇంత భారీ మొత్తంలో లావాదేవీలు జరిగాయి'' అని తెలిపారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు అధికారి తెలిపారు.

Next Story