నితీశ్‌ను రెండుసార్లు సీఎం చేశాను.. మీ నాన్న‌ను ఆయ‌నే ముఖ్య‌మంత్రి చేశారు

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో (బీహార్‌ ఎన్నికలు 2025) జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

By Medi Samrat
Published on : 6 March 2025 10:37 AM IST

నితీశ్‌ను రెండుసార్లు సీఎం చేశాను.. మీ నాన్న‌ను ఆయ‌నే ముఖ్య‌మంత్రి చేశారు

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో (బీహార్‌ ఎన్నికలు 2025) జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. నితీష్‌ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేసింది తానేనని అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ పాట్నాలో అన్నారు. ఈ ప్రకటనపై కేంద్ర మంత్రి, కమ్ ముంగేర్ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ స్పందించారు.

తేజస్వి యాదవ్ ప్రకటనపై కేంద్ర మంత్రి లాలన్ సింగ్ స్పందిస్తూ.. లాలూ యాదవ్, తేజస్వి యాదవ్‌లను తీవ్రంగా టార్గెట్ చేశారు. 1990లో లాలూ యాదవ్ బీహార్ సీఎం అవ‌డానికి కారణం నితీష్ కుమార్ అని ఆయన పేర్కొన్నారు. నితీష్ కుమార్ రాత్రంతా మేల్కొని లాలూ యాదవ్ కోసం ప్రచారం చేసి సీఎంను చేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లాలూ యాదవ్‌కు మద్దతుగా లేరని.. ఆయన సొంత ప్రతిపాదకుడు, ఒక ఎమ్మెల్యే శివశంకర్ మాత్ర‌మే త‌న‌తో ఉన్నారన్నారు.

బడ్జెట్‌పై తేజస్వి యాదవ్‌ స్పందనపై కూడా కేంద్రమంత్రి దాడి చేశారు. బడ్జెట్ బాగుందని.. అందుకే ఇది ప్రభుత్వ ఆదా బడ్జెట్ అని ఇంతమంది చెబుతున్నారని అన్నారు. తేజశ్విని సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదని లాలన్ సింగ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు.

దాణా కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ లాలూ యాదవ్‌పై కూడా కేంద్రమంత్రి విరుచుకుపడ్డారు. దేశానికి హెచ్ డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు లాలూ యాదవ్ ప్రధాని కావడానికి ఢిల్లీ వెళ్లారని అన్నారు. దాణా కుంభకోణంలో అతని పేరు వచ్చింది.. ప్రధానమంత్రి కావాలనే అతని కల నెరవేరలేదు అని ఆరోపించారు.

లాలూ యాదవ్‌ను తానే ముఖ్యమంత్రిని చేశానని మార్చి 4వ తేదీ మంగళవారంనాడు సీఎం నితీశ్‌ కుమార్‌ అసెంబ్లీలో చెప్పారు. ఈ ప్రకటన తర్వాత బీహార్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. నితీష్‌ కుమార్‌ను ఒకసారి కాదు రెండుసార్లు సీఎంను చేశానని తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం నితీశ్ ప్రకటనకు కేంద్ర మంత్రి లాలన్ సింగ్ మద్దతు పలికారు.

Next Story