ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు పడిన బీజేపీ మాజీ శాసనసభ్యుడు కుల్దీప్ సింగ్ సెంగార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కోరుతూ సెంగార్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు ముక్తా గుప్తా, పూనమ్ ఎ బాంబాతో కూడిన ధర్మాసనం జనవరి 27 నుండి ఫిబ్రవరి 10 వరకు కుల్దీప్ సెంగార్ కు బెయిల్ ఇచ్చారు. రూ. 1 లక్ష చొప్పున రెండు పూచీకత్తులను అందించాలని కోరారు.
కూతురి పెళ్లి ఉన్నందున తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలంటూ డిసెంబర్ 19న సెంగార్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఆయనకు 15 రోజుల తాత్కాలిక బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు ఆదేశాల మేరకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు కుల్దీప్ సింగ్ సెంగార్ బయట ఉండనున్నారు. 2017లో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, అతని స్నేహితులు మైనర్ బాలిక పై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక తండ్రిని హత్య చేశారు. నేరం రుజువుకావడంతో ట్రయల్ కోర్టు కుల్దీప్ కు జీవిత ఖైదు విధించింది.