అయోధ్య రామమందిరంలో నమాజ్‌కు ప్రయత్నించిన వ్యక్తి.. గట్టిగా నినాదాలు చేస్తూ..

అయోధ్యలోని రామమందిర సముదాయం లోపల ఓ వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని ఆపడానికి ప్రయత్నించిన సమయంలో గట్టిగా నినాదాలు చేశాడు.

By -  అంజి
Published on : 11 Jan 2026 6:56 AM IST

Kashmiri man, namaz , Ayodhya, Ram Mandir, raises slogans, Uttarpradesh

అయోధ్య రామమందిరంలో నమాజ్‌కు ప్రయత్నించిన వ్యక్తి.. గట్టిగా నినాదాలు చేస్తూ..

అయోధ్యలోని రామమందిర సముదాయం లోపల ఓ వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని ఆపడానికి ప్రయత్నించిన సమయంలో గట్టిగా నినాదాలు చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన కాశ్మీర్‌కు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తిని కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లా నివాసి అహ్మద్ షేక్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 55 ఏళ్ల వ్యక్తి శుక్రవారం అత్యంత భద్రత కలిగిన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, మందిరాన్ని సందర్శించిన తర్వాత, సీతా రసోయి ప్రాంతానికి సమీపంలో కూర్చుని, అక్కడ నమాజ్ చేయడానికి సిద్ధమయ్యాడని అధికారులు తెలిపారు.

అతని చర్యలను గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆలయ భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని, తరువాత విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. అతన్ని ఆపినప్పుడు, ఆ వ్యక్తి నినాదాలు చేశాడని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. అయితే, షేక్ మానసిక అనారోగ్యంతో ఉన్నాడని అతని కుటుంబం తెలిపింది. వారి వాదనకు మద్దతుగా శ్రీనగర్ మెడికల్ కాలేజీలోని సైకియాట్రీ విభాగం నుండి వైద్య రికార్డులను పంచుకుంది. దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు ఆ వ్యక్తి ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నిస్తున్నాయని పోలీసులు తెలిపారు. అతను అయోధ్యకు ఎందుకు వచ్చాడు. మరెవరైనా పాల్గొన్నారా అనే దానితో సహా అతని ప్రయాణ వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ప్రాథమిక తనిఖీల్లో, పోలీసులు అతని వద్ద జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటి వస్తువులను కనుగొన్నట్లు సమాచారం. ఆ వ్యక్తి తాను అజ్మీర్‌కు ప్రయాణిస్తున్నట్లు దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన నేపథ్యంలో సీనియర్ పోలీసు అధికారులు, నిఘా సంస్థలు కూడా రామమందిర సముదాయంలోని భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం, రామాలయ ట్రస్ట్ ఇప్పటివరకు దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. వచ్చే వారం అయోధ్యలో మకర సంక్రాంతి వేడుకలు జరుగుతుండగా ఈ సంఘటన జరగడం గమనార్హం. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో జనం హాజరవుతారని భావిస్తున్నారు. దీనితో ఆలయ పట్టణం అంతటా భద్రతను పెంచారు. జనవరి 22న రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం రెండవ వార్షికోత్సవానికి ముందు కూడా ఇది జరిగింది.

Next Story