ఇరాన్‌ అధ్యక్షుడి మృతి.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్‌

ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీకి నివాళులర్పిస్తూ మే 21న ఒక రోజు సంతాప దినంగా భారతదేశం ప్రకటించింది.

By అంజి
Published on : 20 May 2024 7:45 PM IST

Iran President, President Raisi, India, one day state mourning

ఇరాన్‌ అధ్యక్షుడి మృతి.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్‌

ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్‌లకు నివాళులర్పిస్తూ మే 21న ఒక రోజు సంతాప దినంగా భారతదేశం ప్రకటించింది. రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. 1989లో ఇరాన్‌ తొలి సుప్రీంలీడర్‌ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో భారత్‌ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.

ఇరాన్‌‌ సుప్రీం లీడర్‌‌‌గా అధికారం చేపట్టడానికి అడుగు దూరంలో నిలిచారు ఇబ్రహీం రైసీ. ఆ స్థానానికి ఆయనే తగిన వారనే సిఫార్సులు కూడా ఉన్నాయి. కానీ, ఒక నాటకీయ పరిణామం ఈ పరిస్థితిని మార్చేసింది. ఆదివారం (మే 19) హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయారు.ఆదివారం (మే 19) హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయారు.

ఇరాన్ అధ్యక్షుడితో పాటు విదేశాంగ మంత్రి, మరికొంత మంది మరణించారు. ఇరాన్ -అజార్‌బైజాన్ సరిహద్దుల్లోని కలాసి, ఖొదాఫరీన్ అనే రెండు ఆనకట్టలను ప్రారంభించిన అనంతరం రైసీ ఈ హెలికాప్టర్‌లో తబ్రిజ్ నగరానికి బయల్దేరారు. రైసీ కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉండగా, వాటిలో రెండు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న బెల్-212 హెలికాప్టర్ మాత్రం ప్రమాదానికి గురైంది.

Next Story