మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు

India Reports17135 new corona infections.దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొన‌సాగుతున్నాయి. నిన్న దేశ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2022 5:00 AM GMT
మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు

దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొన‌సాగుతున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,64,919 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 17,135 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,67,144కి చేరింది. గత 24 గంటల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,26,477కి చేరింది.

నిన్న 19,823 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,34,03,610 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,37,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.49శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 3.69 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 23,49,651 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 204.84 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story