క‌రోనా త‌గ్గుముఖం.. ల‌క్ష‌కు దిగువ‌కు కేసులు

India reports 86498 new covid 19 cases in last 24 hours.దేశంలో క‌రోనా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2021 4:35 AM GMT
క‌రోనా త‌గ్గుముఖం.. ల‌క్ష‌కు దిగువ‌కు కేసులు

దేశంలో క‌రోనా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 18,73,485 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 86,498 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,96,473కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,123 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,51,309 ల‌కు చేరింది. నిన్న 1,82,282 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,73,41,462 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 13,03,702 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 4.62శాతానికి పడిపోయిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 4.62 శాతానికి పడిపోయిందని, వరుసగా 15 రోజుల్లో పది శాతానికి కన్నా తక్కువగానే నమోదైందని చెప్పారు. టీకా డ్రైవ్‌లో 23,61,98,726 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.

Next Story