వ‌రుస‌గా రెండో కూడా వెయ్యి లోపే

India Reports 830 new corona cases.వ‌రుస‌గా రెండో కూడా దేశంలో వెయ్యిలోపే కేసులు న‌మోదు అయ్యాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2022 5:18 AM GMT
వ‌రుస‌గా రెండో కూడా వెయ్యి లోపే

వ‌రుస‌గా రెండో కూడా దేశంలో వెయ్యిలోపే కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న కొత్త‌గా 830 కేసులు వెలుగు చూసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,45,768కి చేరింది. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 5,28,981 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 1,771 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,40,95,180కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 21,607 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.76 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 0.67 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 96,633 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.57 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story