స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

India Reports 811 fresh covid cases.దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2022 5:06 AM GMT
స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 811 కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,62,952కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 4,41,18,882 మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారు.

నిన్న క‌రోనా కార‌ణంగా 2 మంది మృతి చెందారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,30,511కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 13,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.78 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 219.75 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story