శుభ‌వార్త‌.. లక్షకు దిగువన కరోనా యాక్టివ్ కేసులు

India reports 6915 new Covid infections.భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి దాదాపుగా అదుపులోకి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. రోజు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2022 4:44 AM GMT
శుభ‌వార్త‌.. లక్షకు దిగువన కరోనా యాక్టివ్ కేసులు

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి దాదాపుగా అదుపులోకి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. రోజు వారి కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు 10 వేల‌కు పైగా న‌మోదు అయిన పాజిటివ్ కేసులు నేడు 6వేల‌కు దిగొచ్చాయి. గ‌డిచిన 24 గంటల్లో 9,01,647 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 6,915 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,31,045కి చేరింది. నిన్న 180 మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,14,023కి చేరింది.

ఒక్క రోజులో 16,864 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,23,24,550కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 92,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.59 శాతానికి చేరింది. రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.77 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న18,22,513 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,77,70,25,914 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story