భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. త‌గ్గిన కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

India reports 43393 New covid-19 cases in last 24 hours.భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2021 4:35 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. త‌గ్గిన కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త త‌గ్గిన‌ప్ప‌టికి.. మ‌ర‌ణాల సంఖ్య మాత్రం పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 17,90,708 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 43,393 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల‌ చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,52,950కి చేరింది. నిన్న ఒక్క రోజే 911 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,05,939 కి పెరిగింది.

నిన్న 44,459 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,98,88,284 చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 4,58,727 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.19శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.36శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.42శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 40,23,173 ల‌క్ష‌లు టీకాలు అందించ‌గా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 36,89,91,222 కోట్ల‌కు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story