భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన కేసులు

India Reports 4272 new covid-19 cases.రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Sep 2022 5:24 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన కేసులు

రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 3,16,916 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 4,272 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 4,474 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న‌వారి సంఖ్య 4,40,13,999 మందికి చేరింది. నిన్న27 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,28,611కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 40,750 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.72 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.35 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 21,63,248 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 218.17 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story