భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కేసులు పెరుగుతున్నాయా..? త‌గ్గుతున్నాయా..?

India Reports 4129 new covid-19 cases.గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,74,755 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sep 2022 4:52 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కేసులు పెరుగుతున్నాయా..? త‌గ్గుతున్నాయా..?

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,74,755 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 4,129 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 4,255 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న‌వారి సంఖ్య 4,40,04,533 మందికి చేరింది. నిన్న 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన‌ వారి సంఖ్య 5,28,530 కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 42,358 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.72 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.18 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 14,08,253 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 217.82 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story