భారత్ కరోనా అప్డేట్.. పెరిగిన కేసులు.. వ్యాక్సినేషన్లో కీలక మైలురాయి
India reports 41157new covid-19 cases in last 24hours.భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 18 July 2021 4:50 AM GMT
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 19,36,709 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 41,157 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,06,065కి చేరింది. నిన్న ఒక్క రోజే 518 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,13,609 కి పెరిగింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) July 18, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/ouKZrRWedf pic.twitter.com/sTREQi2kjs
నిన్న42,004 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,02,69,796 చేరింది. ప్రస్తుతం దేశంలో 4,22,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.31శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.08శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.13 శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 46.38 లక్షల మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 40,49,31,715 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దీంతో వ్యాక్సినేషన్లో భారత్ మరో కీలక మైలురాయిని దాటినట్లు అయ్యింది.