త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

India Reports 3947 new covid-19 cases.దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sep 2022 4:29 AM GMT
త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 3,20,734 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 3,947 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 5,096 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న‌వారి సంఖ్య 4,40,19,095 మందికి చేరింది. నిన్న 18 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,28,629కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 39,583 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.73 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.23 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 34,21,962 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 218.52 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story