త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు

India Reports 3615 new covid-19 cases.దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Sep 2022 5:04 AM GMT
త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య తగ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 3,23,293 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 3,615 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 4,972 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న‌వారి సంఖ్య 4,40,09,525 మందికి చేరింది. న్న 14 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన‌ వారి సంఖ్య 5,28,584 కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 40,979 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.72 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.12 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 13,87,533 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 217.96 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story