శాంతిస్తున్న క‌రోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India reports 3614 new covid infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 8,21,122

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2022 4:51 AM GMT
శాంతిస్తున్న క‌రోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 8,21,122 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 3,614 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,87,875కి చేరింది. నిన్న 89 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,15,803కి చేరింది.

ఒక్క రోజులో 5,185 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,23,31,513కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.71 శాతానికి చేరింది. రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.44 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న18,18,511 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,79,91,57,486 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story