భారత్ కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే
India reports 2828 new covid-19 infections.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రోజు వారి కేసుల్లో
By తోట వంశీ కుమార్ Published on 29 May 2022 5:08 AM GMT
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రోజు వారి కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,74,309 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,828 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,53,043 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,586 కి చేరింది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) May 29, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/VjPopzACNc pic.twitter.com/GHqWj7qttA
నిన్న 2,035 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,11,370కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.74 గా, రోజు వారి పాజిటివ్ రేటు 0.60గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న13,81,764 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,93,28,44,077 డోసులను పంపిణీ చేశారు.