భారీగా పెరిగిన కేసులు

India Reports 2797 new covid-19 cases.దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Oct 2022 5:21 AM GMT
భారీగా పెరిగిన కేసులు

దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,66,839 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 2,797 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 3,884 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న‌వారి సంఖ్య 4,40,51,228 మందికి చేరింది. నిన్న24 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,778 కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 29,251 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.75 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.05 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 4,96,833 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 218.93 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story