దేశంలో కొత్తగా 2685 కేసులు.. 33 మరణాలు
India Reports 2685 new covid-19 infections.దేశంలో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.
By తోట వంశీ కుమార్ Published on
28 May 2022 4:56 AM GMT

దేశంలో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న దేశ వ్యాప్తంగా 4,47,637 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,685 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,50,215 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా 33 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,572కి చేరింది.
నిన్న 2,158 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,09,335కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75 గా, రోజు వారి పాజిటివ్ రేటు 0.60గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న14,39,466 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,93,13,41,918 డోసులను పంపిణీ చేశారు.
Next Story