స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

India Reports 2678 new covid-19 cases.రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2022 5:19 AM GMT
స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు

రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,37,952 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 2,678 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 2,594 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న‌వారి సంఖ్య 4,40,68,557. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,857కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 26,583 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.76 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.13 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 5,93,963 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.21 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story