దేశంలో పెరిగిన కరోనా కేసులు
India Reports 2628 new covid-19 infections.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు
By తోట వంశీ కుమార్ Published on
26 May 2022 5:00 AM GMT

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. నిన్న దేశ వ్యాప్తంగా 4,52,580 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,628 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,44,820 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా 18 మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,525కి చేరింది.
నిన్న 2,167 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,04,881కి చేరింది. ప్రస్తుతం దేశంలో 15,414 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75 గా, రోజు వారి పాజిటివ్ రేటు 0.51గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న13,13,687 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,92,82,03,555 డోసులను పంపిణీ చేశారు.
Next Story