భారత్ కరోనా అప్డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే
India Reports 2323 new covid-19 infections.దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు
By తోట వంశీ కుమార్ Published on 21 May 2022 4:44 AM GMT
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిన్న దేశ వ్యాప్తంగా 4,99,382 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,323 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,34,145 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,348కి చేరింది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) May 21, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/BhDPrhCZ7b pic.twitter.com/N9mEVbOt1m
నిన్న 2,346 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,94,801 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 14,996 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75 గా, రోజు వారి పాజిటివీ రేటు 0.47గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 15,32,383 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,92,12,96,720 డోసులను పంపిణీ చేశారు.