దేశంలో కొత్త‌గా 2259 కేసులు

India Reports 2259 new covid-19 infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. రోజువారి కేసుల సంఖ్య‌లో హెచ్చు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2022 4:58 AM GMT
దేశంలో కొత్త‌గా 2259 కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. రోజువారి కేసుల సంఖ్య‌లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 4,51,179 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 2,259 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,31,822 కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా 20 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,323కి చేరింది.

గ‌త 24 గంట‌ల్లో 2,614 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,92,455 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 15,044 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.75 గా, రోజు వారి పాజిటివీ రేటు 0.50గా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 15,12,766 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,91,96,32,518 డోసుల‌ను పంపిణీ చేశారు.
Next Story