దేశంలో కొత్తగా 2226 కరోనా కేసులు.. 65 మరణాలు
India Reports 2226 new covid-19 infections.దేశంలో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే..
By తోట వంశీ కుమార్ Published on 22 May 2022 5:11 AM GMT
దేశంలో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. 2500 లోపే కేసులు నమోదు అవుతుండడం ఊరట కలిగించే అంశం. నిన్న దేశ వ్యాప్తంగా 4,42,681 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,226 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,36,371 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా 65 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,413కి చేరింది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) May 22, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/zgTFaRGp5Z pic.twitter.com/UDo5PAqUwz
నిన్న 2,202 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,97,003 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 14,955 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75 గా, రోజు వారి పాజిటివీ రేటు 0.50గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 14,37,381 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,92,28,66,524 డోసులను పంపిణీ చేశారు.