క‌రోనా విజృంభ‌ణ‌.. 21వేలు దాటిన కొత్త కేసులు

India Reports 21556 new covid 19 infections.దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2022 4:44 AM GMT
క‌రోనా విజృంభ‌ణ‌.. 21వేలు దాటిన కొత్త కేసులు

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 5,07,360 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 21556 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,38,25,185కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా 45 మంది మ‌ర‌ణించారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 5,25,870 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు.

నిన్న 18,294 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,31,50,434కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,48,881 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.46 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.25 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 29.12ల‌క్ష‌ల టీకాల‌ను పంపిణీ చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 200.91 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story