స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు

India Reports 2141 new covid-19 cases.దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Oct 2022 4:55 AM GMT
స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు

దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,51,515 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 2,141 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 20 మంది కరోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,28,943కి చేరింది.

నిన్న 2,579 మంది కోలుకోగా.. మొత్తంగా ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 4,40,82,064. ప్ర‌స్తుతం దేశంలో 25,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.76 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 0.85 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 4,90,711 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.46 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story