దేశంలో కొత్త‌గా 2,124 కేసులు.. 1,977 రిక‌వ‌రీలు

India Reports 2124 new covid-19 infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 May 2022 5:01 AM GMT
దేశంలో కొత్త‌గా 2,124 కేసులు.. 1,977 రిక‌వ‌రీలు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. నిన్న‌ దేశ వ్యాప్తంగా 4,58,924 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 2,124 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,42,192 కి చేరింది. 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,507కి చేరింది.

నిన్న 1,977 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,26,02,714కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 14,971 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.75 గా, రోజు వారి పాజిటివ్ రేటు 0.46గా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న13,27,544 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,92,67,44,769 డోసుల‌ను పంపిణీ చేశారు.
Next Story