మ‌రోసారి పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

India Reports 20557 new corona infections.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2022 5:03 AM GMT
మ‌రోసారి పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది . నిన్న దేశ వ్యాప్తంగా 3,96,783 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 20557 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,39,59,321కి చేరింది. గత 24 గంటల్లో 44 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,26,211కి చేరింది.

నిన్న 19,216మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,32,86,787 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,46,323 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.47శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 5.18 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 42,20,625 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 203.21 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story