దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. 70 మ‌ర‌ణాలు

India Reports 20551 new corona infections.క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి దేశంలో కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2022 4:39 AM GMT
దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. 70 మ‌ర‌ణాలు

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి దేశంలో కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. నిన్న దేశ వ్యాప్తంగా 4,00,110 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 20,551 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,41,07,588కి చేరింది. గత 24 గంటల్లో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,26,600కి చేరింది.

నిన్న 21,595 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,34,45,624 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,35,364 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.50శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 5.14 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 36,95,835 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 205.59 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story