దేశంలో 200 కోట్ల మైలురాయికి చేరువ‌లో టీకా పంపిణీ

India Reports 20528 new covid-19 infections.దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2022 4:52 AM GMT
దేశంలో 200 కోట్ల మైలురాయికి చేరువ‌లో టీకా పంపిణీ

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 3,92,569 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 20,528 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,37,50,599కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 49 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,25,709 కి చేరింది.

నిన్న 17,790 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,30,81,441కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,43,449 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.47 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 5.23 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 25,59,840 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 1,99,98,89,097 డోసులను పంపిణీ చేశారు.

Next Story