కొత్త కేసుల కంటే రిక‌వ‌రీలే ఎక్కువ‌

India Reports 20409 new corona infections.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 3,98,761 క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2022 4:42 AM GMT
కొత్త కేసుల కంటే రిక‌వ‌రీలే ఎక్కువ‌

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 3,98,761 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 20409 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,39,79,730కి చేరింది. గత 24 గంటల్లో 47 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,26,258కి చేరింది.

నిన్న 22,697 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,33,09,484 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,43,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.48శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 5.12 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 38,63,960 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 203.60 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story