దేశంలో కొత్త‌గా 20,408 కేసులు.. 54 మ‌ర‌ణాలు

India Reports 20408 new corona infections.దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,04,399

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2022 4:43 AM GMT
దేశంలో కొత్త‌గా 20,408 కేసులు.. 54 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,04,399 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 20408 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,00,138కి చేరింది. గత 24 గంటల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,26,312కి చేరింది.

నిన్న 20,958 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,33,30,442 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,43,384 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.48శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 5.05 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 33,87,173 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 203.94 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story