దేశంలో కొత్త‌గా 20279 కేసులు.. 36 మ‌ర‌ణాలు

India Reports 20279 new covid-19 infections.దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2022 4:36 AM GMT
దేశంలో కొత్త‌గా 20279 కేసులు.. 36 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. నిన్న దేశ వ్యాప్తంగా 3,83,657 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 20,279 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,38,88,755కి చేరింది. గత 24 గంటల్లో 36 మంది కరోనాతో మ‌ర‌ణించారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,26,033కి చేరింది.

నిన్న 18,143 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,32,10,522 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,52,200 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.45 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 5.29 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న28,83,489 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 201.99 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story