మ‌రోసారి భారీగా పెరిగిన కేసులు

India Reports 20139 new covid-19 infections.దేశంలో మ‌రోసారి క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. నిన్న దేశ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2022 4:53 AM GMT
మ‌రోసారి భారీగా పెరిగిన కేసులు

దేశంలో మ‌రోసారి క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 3,94,774 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 20139 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,36,89,989కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 38 మంది మ‌ర‌ణించారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి 5,25,557మంది ప్రాణాలు కోల్పోయారు.

నిన్న 16,482 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,30,28,356కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,36,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.49 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 5.10 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 199.27కోట్ల‌ డోసులను పంపిణీ చేశారు.

Next Story