క‌రోనా విజృంభ‌ణ‌.. వ‌రుస‌గా మూడో రోజు 20వేల‌కు పైనే కేసులు

India Reports 20044 new covid-19 infections.దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. వ‌రుస‌గా మూడో రోజు కూడా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2022 4:54 AM GMT
క‌రోనా విజృంభ‌ణ‌.. వ‌రుస‌గా మూడో రోజు 20వేల‌కు పైనే కేసులు

దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. వ‌రుస‌గా మూడో రోజు కూడా 20వేల‌కు పైనే పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,17,895 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 20,044 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,37,30,071కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 53 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,25,660 కి చేరింది.

నిన్న 18,301 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,30,63,651కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,40,760 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.48 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.80 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 199.71కోట్ల‌ డోసులను పంపిణీ చేశారు.

Next Story