త‌గ్గేదేలే.. రెండో రోజు 20వేల‌కు పైనే కేసులు

India reports 20038 new covid-19 infections.దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,50,820

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2022 4:54 AM GMT
త‌గ్గేదేలే.. రెండో రోజు 20వేల‌కు పైనే కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,50,820 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 20,038 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,37,10,027కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,25,604 కి చేరింది.

నిన్న 16,994 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,30,45,350కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,39,073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.48 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.44 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 199.47కోట్ల‌ డోసులను పంపిణీ చేశారు.

Next Story