దేశంలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు

India Reports 1994 new covid-19 cases.నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2022 5:07 AM GMT
దేశంలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా కొత్త‌గా 1,994 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,961కి చేరింది.

నిన్న 2,601 మంది కోలుకోగా.. మొత్తంగా ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 4,40,90,349. ప్ర‌స్తుతం దేశంలో 23,432 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.76 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 1.24 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 2,10,617 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.55 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story