స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

India Reports 19893 new corona infections.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,03,006 క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2022 5:09 AM GMT
స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,03,006 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 19,893 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,87,037కి చేరింది. గత 24 గంటల్లో 53 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,26,530కి చేరింది.

నిన్న 20,419 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,34,24,029 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,36,478 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.50శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.94 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 38,20,676 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 205.22 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story