దేశంలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

India Reports 19406 new corona infections.దేశంలో క‌రోనా రోజువారీ కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2022 4:46 AM GMT
దేశంలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

దేశంలో క‌రోనా రోజువారీ కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిన్న‌టితో పోలీస్తే నేడు కేసుల సంఖ్య త‌గ్గింది. నిన్న దేశ వ్యాప్తంగా 3.91ల‌క్ష‌ల మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 19,406 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,41,26,994కి చేరింది. గత 24 గంటల్లో 49 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన‌ వారి సంఖ్య 5,26,649కి చేరింది.

నిన్న 19,928 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,34,65,552 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,34,793 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.50శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.96 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 32,73,551 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 205.92 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story