భార‌త్‌లో క‌రోనా విజృంభ‌ణ‌.. భారీగా పెరిగిన కేసులు

India reports 18930 new covid-19 infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోమారు విజృంభిస్తోంది. గ‌త రెండు రోజులుగా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2022 5:03 AM GMT
భార‌త్‌లో క‌రోనా విజృంభ‌ణ‌.. భారీగా పెరిగిన కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోమారు విజృంభిస్తోంది. గ‌త రెండు రోజులుగా కేసులు భారీ సంఖ్య‌లో పెరుగుతున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,38,005 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 18,930 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,66,739కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 35 మంది మ‌ర‌ణించారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి 5,25,305 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిన్న 14,650 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,29,21,977కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,19,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.52 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.32 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 11.4 ల‌క్ష‌ల మంది టీకా తీసుకోగా మొత్తంగా ఇప్పటి వరకు 198.33కోట్ల‌ డోసులను పంపిణీ చేశారు.

Next Story