భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 4 శాతంపైనే పాజిటివిటీ రేటు

India Reports 18840 new covid-19 infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2022 4:43 AM GMT
భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. 4 శాతంపైనే పాజిటివిటీ రేటు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,54,778 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 18,840 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,36,04,394కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 43 మంది మ‌ర‌ణించారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి 5,25,386 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిన్న 16,104 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,29,53,980కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,25,028 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.51 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.14 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 12.26 ల‌క్ష‌ల మంది టీకా తీసుకోగా మొత్తంగా ఇప్పటి వరకు 198.65 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story