త‌గ్గేదేలే.. క‌రోనా కేసులు పెరుగుతున్నాయ్‌.. కొత్త‌గా ఎన్నంటే

India Reports 18815 new covid-19 infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2022 5:32 AM GMT
త‌గ్గేదేలే.. క‌రోనా కేసులు పెరుగుతున్నాయ్‌.. కొత్త‌గా ఎన్నంటే

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 3,79,470 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 18,815 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,85,554కి చేరింది. నిన్న‌క‌రోనా కార‌ణంగా 38 మంది మృతి చెందారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి 5,25,343 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిన్న 15,899 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,29,37,876కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,22,335 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.51 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.96 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 17.62 ల‌క్ష‌ల మంది టీకా తీసుకోగా మొత్తంగా ఇప్పటి వరకు 198.51 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story