స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

India Reports 18738 new corona infections.దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. రోజువారి కేసుల్లో హెచ్చుత‌గ్గులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2022 4:46 AM GMT
స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు.. కొత్త‌గా ఎన్నంటే

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. రోజువారి కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 3,72,910 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 18,738 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. గత 24 గంటల్లో 40 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన‌ వారి సంఖ్య 5,26,689కి చేరింది.

నిన్న 18,558 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,34,84,110 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,34,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.50శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు5.02 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 29,58,617 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 206.21 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story