అదుపులోనే క‌రోనా మ‌హ‌మ్మారి.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India Reports 1829 new covid-19 infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2022 5:00 AM GMT
అదుపులోనే క‌రోనా మ‌హ‌మ్మారి.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,34,962 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,829 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,27,199 కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా 33 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,293కి చేరింది.

గ‌త 24 గంట‌ల్లో 2,549 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,25,87,259 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 15,647 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.75 గా, రోజు వారి పాజిటివీ రేటు 0.42గా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 14,97,695 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,91,65,00,770 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story