దేశంలో కొత్త‌గా 1675 కేసులు.. 31 మ‌ర‌ణాలు

India Reports 1675 new covid-19 infections.దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిన్న‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 May 2022 4:53 AM GMT
దేశంలో కొత్త‌గా 1675 కేసులు.. 31 మ‌ర‌ణాలు

దేశంలో రోజువారి క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిన్న‌ దేశ వ్యాప్తంగా 4,07,626 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 1,675 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,40,068 కి చేరింది. 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 31 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,24,490కి చేరింది.

నిన్న 1,635 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,26,00,737 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 14,841 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.75 గా, రోజు వారి పాజిటివ్ రేటు 0.41గా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న13.76 ల‌క్ష‌ల‌ మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 192.52 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story