స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు

India Reports 16561 new covid-19 infections.దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. నిన్న దేశ వ్యాప్తంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2022 4:52 AM GMT
స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. నిన్న దేశ వ్యాప్తంగా 3,04,189 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 16,561 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,23,557కు చేరింది. గ‌డిచిన‌ 24 గంటల్లో 49 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,26,928కి చేరింది.

నిన్న 18,053 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,35,73,094 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,23,535 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.53 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 5.44శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 17,72,441 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 207.47 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story