భార‌త్‌లో త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా.. కొత్తగా ఎన్నికేసులంటే..?

India reports 165553 new covid 19 cases in last 24 hours.దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 May 2021 4:37 AM GMT
భార‌త్‌లో త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా.. కొత్తగా ఎన్నికేసులంటే..?

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 20,63,839 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 1,65,553 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,94,800కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 3,460 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,25,972 ల‌కు చేరింది. నిన్న 2,76,309 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,54,54,320 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 21,14,508 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 21,20,66,614 డోసులు వేసిన‌ట్లు చెప్పింది




Next Story