త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India Reports 16464 new corona infections.దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2022 5:27 AM GMT
త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య త‌గ్గింది. నిన్న దేశ వ్యాప్తంగా 2,73,888 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 16,464 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు సోమ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,36, 275కి చేరింది. గత 24 గంటల్లో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,26,396కి చేరింది.

నిన్న 16,112 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,33,65,890 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,43,989 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.48శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 6.01 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 8,34,167 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 204.34 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story