పాజిటివ్ కేసుల కంటే రిక‌వ‌రీలే ఎక్కువ‌

India Reports 16299 new-covid-19-infections.దేశంలో క‌రోనా రోజువారీ కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2022 5:00 AM GMT
పాజిటివ్ కేసుల కంటే రిక‌వ‌రీలే ఎక్కువ‌

దేశంలో క‌రోనా రోజువారీ కేసుల్లో హెచ్చుత‌గ్గులు కొన‌సాగుతున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 3,56,153 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా 16,299 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. గ‌డిచిన‌ 24 గంటల్లో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,26,879కి చేరింది.

నిన్న 19,431మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,35,55,041కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,25,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.53 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.58శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 25,75,389 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 207.29 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story